YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న భారత యువతి

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న భారత యువతి

న్యూఢిల్లీ డిసెంబర్ 13
మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌-2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కినట్లయింది. మొదటిసారిగా 1994లో సుస్మితా సేన్‌ విశ్వ సుందరి కిరీటాన్ని ధరించింది. తర్వాత 2000 సంవత్సరంలో లారాదత్తా ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. మళ్లీ సరిగ్గా 21 ఏండ్ల తర్వాత అందులోనూ 2021లో 21 ఏండ్ల హర్నాజ్‌ సంధుకు ఈ కిరీటం దక్కడం విశేషం.

Related Posts