YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

చైనాలో మళ్లీ లాక్ డౌన్

చైనాలో మళ్లీ లాక్ డౌన్

బీజింగ్, డిసెంబర్ 24,
కోవిడ్ కేసులు పెరగడంతో చైనాలో మళ్లీ కఠినమైన లాక్‌డౌన్ విధిస్తోంది. పెద్ద నగరాల్లో ఒకటైనా జియాన్‌లో లాక్‌డౌన్ విధించింది. ఈ నగరంలో 1.3 కోట్లమంది జనాభా ఉంది. ఈ నగరంలో కఠినమైన ఆంక్షలను విధించింది. అక్కడ పది రోజుల్లో140 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నిత్యావసరాల కొనుగోలుకు రెండు రోజుల ఒకసారి ఇంట్లో ఒక వ్యక్తికి అనుమతి ఇచ్చారు. ఆ నగరానికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ సిటీ ఎయిర్ పోర్టు నుంచి 85 శాతం ఫ్లైట్స్‌ను నిలిపివేశారు. మీటింగులు, ప్రజలు గుమిగూడే అన్ని అవకాశాలపై కఠిన ఆంక్షలను విధించారు. అక్కడ పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అక్కడ రెండు నెలల్లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో అవి జరుగుతాయో.. లేదోననే టెన్షన్ మొదలైంది.కోవిడ్ వైరస్ వ్యాప్తి చైనాలోని వుహాన్ నుంచి మొదలైంది. అప్పట్లో చైనా చాలా కఠినమైన లాక్‌డౌన్ విధించింది. ప్రజలను ఏ మాత్రం ఇళ్ల నుంచి రాకుండా వారికి ఆహారాన్ని పంపిణీ చేసింది. బయట ఒక్కరూ కూడా కనిపించకుండా ఉండేంత కఠిన మైన ఆంక్షలను పెట్టింది. లక్షలాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడడంతో ఆస్పత్రిల్లో వైద్యాన్ని అందించింది. ఏకంగా ఒక ఆస్పత్రినే నిర్మించి మరీ వైద్య సేవలను అందించి కోవిడ్ కట్టడి చేసింది. చాలాకాలం తర్వాత అక్కడ ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు చైనాలో లాక్‌డౌన్ విధించారు.మరోవైపు ఒమిక్రాన్ ప్రపంచంపై విరుచుకుపడుతుంది. బ్రిటన్‌లో లక్షలాది సంఖ్యలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నెదర్లాండ్‌లో కూడా లాక్‌డౌన్ విధించారు. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో దేశంలో ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. పండగల సమయంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో న్యూ ఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై నిషేధం విధించాయి.

Related Posts