YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

హైదరబాదు, జనవరి 28
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అటు ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది.అటు ఆన్‌లైన్ ద్వారా విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. పిల్లలకు మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని వారికి డీహెచ్ శ్రీనివాసరావు సమాధానం ఇచ్చారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

Related Posts