YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకున్న మంత్రి తలసాని

ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకున్న మంత్రి తలసాని

హైదరాబాద్
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల దుర్గామాత దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఏడుపాయలకు అనేక నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వాలు ఏడుపాయల ను పూర్తిగా విస్మరించాయని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏడుపాయల క్షేత్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఏడాదికేడాది ఏడుపాయల అభివృద్ధి చెందుతోందన్నారు..

Related Posts