YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

పాకిస్తాన్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

ఇస్లామాబాద్ మార్చ్ 4
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి 30 మంది చనిపోయారు, మరో 56 మంది గాయాలపాలయ్యారు. కిస్సా ఖ్వాని బజార్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారికి పెషావర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెషావర్ సిటీ పోలీస్ అధికారి ఇజాజ్ అషాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు మసీదులోకి చొరబడే ప్రయత్నంలో ముందుగా డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారట. అనంతరం మసీదులో బీభత్సం సృష్టించారని తెలిపారు. శుక్రవారం ప్రార్థన జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని, అయితే ఈ దాడిపై ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదని పెషావర్ పోలీసులు పేర్కొన్నారు. దాడిలో చనిపోయిన 30 మంది మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని లేడీ రీడింగ్ మీడియా మేనేజర్ ఆసిమ్ ఖాన్ తెలిపారు.

Related Posts