YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలవరం ఖర్చంతా కేంద్రం భరిస్తుంది

పోలవరం ఖర్చంతా కేంద్రం భరిస్తుంది

విజయవాడ, మార్చి 4,
ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌  పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్  కలిసి ఆయన పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరు 1లో నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ లు మాట్లాడారు. తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో ముచ్చటించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్‌ మాట్లాడుతూ.. పోలవరాన్ని వైఎస్‌ఆర్‌ ముందుకు తెచ్చారని, పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని మంత్రి షెకావత్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముందుగా 1970లో అనుకున్నారని, అప్పటి దివంగత రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించారని కేంద్రమంత్రి తెలిపారు. 2014 ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ ఒక సంవత్సరంలో పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, పునరావాస నిర్వాసితులకు మంచి వాతావరణం కనిపిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలవరం, ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్‌ వెల్లడించారు. వైఎస్సార్‌ హయాంలో భూసేకరణలో ఎకరానికి లక్షన్నరే ఇచ్చినవారికి రూ. 5లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు.పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన మాటకు మోదీ సర్కార్‌ కట్టుబడి ఉందన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తా కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. 

పోలవరంలో పర్యటించిన గజేంద్రసింగ్‌ షెకావత్‌ :
ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్  కలిసి ఆయన పోలవరంలో పర్యటిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జలశక్తి మంత్రి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అయితే ఇందుకూరు పేట వద్ద ముఖ్యమంత్రి జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌లకు అధికారులు స్వాగతం పలికారు. నిర్వాసితుల పునరావాస కాలనీలను పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరు 1లో నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి షెకావత్‌లు మాట్లాడారు. తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో ముచ్చటించనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో భేటీ కానున్నారు. దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, ఆగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం 306 నిర్వాసితుల కుటుంబాలు చేరుకున్నాయి.

Related Posts