YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

భారీ ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణిని ప‌రీక్షించిన‌ ఉత్తర కొరియా

భారీ ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణిని ప‌రీక్షించిన‌ ఉత్తర కొరియా

న్యూ ఢిల్లీ మార్చ్ 25
అతిపెద్ద ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణి(ఐసీబీఎం)ని ప‌రీక్షించిన‌ట్లు ఇవాళ ఉత్తర కొరియా ప్ర‌క‌టించింది. హాసాంగ్‌-17 మిస్సైల్‌ను తొలిసారి 2020లో ఆవిష్క‌రించారు. భారీ సైజు ఉన్న ఆ క్షిప‌ణిని ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శించారు. 2017 త‌ర్వాత మ‌ళ్లీ గురువారం రోజున ఉత్త‌ర కొరియా తొలిసారి ఐసీబీఎంను ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. ఖండాంత‌ర క్షిప‌ణులు సుదీర్ఘ దూరం ప్ర‌యాణిస్తాయి. కొరియా నుంచి అమెరికాను కూడా అవి చేరుకోగ‌ల‌వు. వాస్త‌వానికి ఉత్త‌ర కొరియాపై ఆ క్షిప‌ణుల ప‌రీక్ష బ్యాన్ ఉంది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేర‌కు గురువారం ఐసీబీఎం ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు ఆ దేశ మీడియా పేర్కొన్న‌ది.ఉత్త‌ర కొరియా త‌న ఆయుధ సంప‌త్తిని పెంచుకుంటోంది. అయితే అణ్వాయుధాల స‌మీక‌ర‌ణ‌లో ఉత్త‌ర కొరియా కొత్త మైలురాయిని చేరుకున్న‌ట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం జ‌రిగిన ఐసీబీఎం ప‌రీక్ష‌ను జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా మిలిట‌రీలు ట్రాక్ చేశాయి. ఆ మిస్సైల్ స‌ముద్ర మ‌ట్టానికి ఆరు వేల కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లిన‌ట్లు జ‌పాన్ తెలిపింది. గంట సేపు ప్‌ంయాణించిన త‌ర్వాత అది జ‌పాన్ జ‌లాల్లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో హాసాంగ్‌-15 మిస్సైల్ 4500 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లింది. ఇప్పుడు హాసాంగ్‌-17 ఆ పాత రికార్డును బ్రేక్ చేసింది.ఒక‌వ‌ళ హాసాంగ్‌-15 క్షిప‌ణిని.. స్టాండ‌ర్డ్ ట్రాజెక్ట‌రీలో పైర్ చేసి ఉంటే, అది దాదాపు 13వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే గురువారం ప్ర‌యోగించిన మిస్సైల్ మ‌రింత ఎక్కువ దూరం వెళ్తుంద‌ని నిపుణులు అన్నారు. దీన్ని రాక్ష‌స క్షిప‌ణిగా పిలుస్తున్నారు.

Related Posts