YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భూమికి పొంచి ఉన్న ముప్పు

భూమికి పొంచి ఉన్న ముప్పు

న్యూయార్క్, మార్చి 26,
అంతరిక్షం అనేది అంతులేనిది. అందులో నిత్యం ఏదో ఒక ప్రమాదమో, అద్భుతమో జరుగుతూనే ఉంటుంది. గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు, వ్యర్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వంలో ప్రతీది కొత్తదే. అయితే అంతరిక్షంలో ఏర్పడే కొన్ని చర్యల వల్ల కొన్ని సార్లు భూమికి ముప్పు ఏర్పడుతుంది. అలాంటి ముప్పే ఏర్పడే అవకాశం ఉంది నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓ గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తుందని గుర్తించారు. ఇది భూమిపై పడితే చాలా ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం భూమిని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా గ్రహశకలాలు ఇప్పుడు భూమి వైపు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలూ జరిగాయి. కొన్ని ప్రమాదం కలిగిస్తే మరికొన్నింటి ద్వారా ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. అంతరిక్షం నుంచి భూమికి మరో ప్రమాదం రాబోతోంది. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా వెల్లడించింది. ఈ శకలం గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు పయనిస్తున్నట్లు పేర్కొంది.450 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ గ్రహ శకలం మిగతా వాటితో పోలిస్తే చిన్నదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఇది భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది ఈసారి భూమికి 51,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం ఈ రోజే భూమిని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. 2033 జులై 14న మరోసారి ఇది భూమి దగ్గరకు వస్తుందనే అంచనాలున్నాయి

Related Posts