YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్, బీజేపీ రెండు మిలాఖత్ అయ్యాయి

కాంగ్రెస్, బీజేపీ రెండు మిలాఖత్ అయ్యాయి

నిజామాబాద్
తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో "నిరసన దీక్ష" నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినా,రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వమే వరి ధాన్యం సేకరిస్తుందని కానీ రెండేండ్ల నుండే మోడీ కావాలని రాజకీయంగా పెచిపెడుతున్నారని మంత్రి విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కరెంట్ ఇబ్బందులు లేకుండా 28వేల కోట్ల విద్యుత్ లైన్లు,సబ్ స్టేషన్లు,ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారని,24 గంటల కరెంట్ కోసం 10 వేల కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తున్నారని, రైతు బంధు ద్వారా ఏడాదికి 14వేల కోట్లు ఇస్తున్నారని చెప్పారు.రైతులు లకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి వారి జీవితాల్లో ఆనందం నింపారని గుర్తు చేసారు.దీంతో రైతులంతా కేసీఆర్ వెంటే ఉంటున్నారని కక్ష్యపూరిత వైఖరితో కేంద్రం తెలంగాణలో యాసంగి వడ్లు కొనమనే డ్రామాకు తెరలేపింది.తెలంగాణలో రైతులు బాగుపడితే బిజెపికి కండ్లు మండి రైతులను కేసీఆర్ నుండి దూరం చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.మెడలు వంచైనా కేంద్రంతో ధాన్యం కొనిపించేవరకు పోరాటం ఆపకూడదన్నారు.ఇది తెలంగాణ రైతులకు జీవన్మరణ సమస్య కానుందన్నారు.ప్రతీ యాసంగి ఇదే సమస్య పునరావృతం అయ్యే ప్రమాదమున్నదని అన్నారు. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడారని గుర్తు చేశారు.తెలంగాణ రైతులకు నూకలు అలవాటు చేయాలని కండకావరంతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పీయూష్ గోయల్ ఆయన స్థాయి మరిచి ఫక్తు వ్యాపారవేత్తల వ్యవహరిస్తున్నాడని అన్నారు.ఆయన కనీసం సర్పంచ్ పదవికి కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు.కేంద్రం దురుద్దేశం సీఎం కేసీఆర్ ముందే గ్రహించి రైతులకు వరి వేయద్దని చెప్తే ,రాష్ట్ర బిజెపి నేతలు రెచ్చగొట్టి వరి వేయించారని అన్నారు.అపుడు మాట ఇచ్చిన బండి సంజయ్,కిషన్ రెడ్డి బిజెపి నేతలు ఇపుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.కేంద్రంతో వడ్లు కొనిపించాలని డిమాండ్ చేశారు.గతంలో తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాలగర్భంలో కలిసినట్లు తెలంగాణ రైతుల ఉసురు తగిలి బిజెపి నేతలకు కూడా అదే గతే పడుతుందని హెచ్చరించారు.కాంగ్రెస్ నేతలు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి బిజెపి తో కుమ్మక్కైన విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు అడగరని ప్రశ్నించారు.పార్టీలు రాజకీయాలు ఏవైనా మన రైతుల సంక్షేమం కోసం ఆలోచించాలని సూచించారు.రైతులు మండే ఎండలో ధర్నాలు చేస్తుంటే ,బిజెపి నిజామాబాద్ ఎంపీ స్టార్ హోటల్ లో జిమ్ చేసుకుంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు.కనీస అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సబ్సిడీ ఇవ్వాలని మాట్లాడుతున్నాడన్నారు.
బీజేపీ ఎంపిపిలు,సర్పంచ్ లు ధాన్యం కొనాలని తీర్మానాలు చేస్తుంటే ఎంపీ అర్వింద్ మాత్రం సోయితప్పి రాష్ట్రమే కేంద్రానికి కమిషన్ ఇవ్వమనటం సిగ్గుచేటన్నారు.ఇప్పటికైనా బిజెపి మనసు మార్చుకొని అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రెండు పంటలు కొనాలని అప్పటి వరకు మా పోరాటం ఆగదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ నిరసన దీక్షలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,జడ్పీ చైర్మన్ విఠల్ రావు పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Posts