YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు

భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు

ముంబై, ఏప్రిల్ 16,
కొన్ని వారాలుగా దేశంలో వంట నూనెల ధరలో స్వల్పంగా తగ్గాయి. ఇంతలోనే కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని వల్ల మరోసారి వంట నూనెలు, రిఫైన్డ్ నూనెధరలు మరోసారి పెరుగనున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెరిగిన ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. ఇప్పటికే పెట్రోలు-డీజిల్, పాలు, పీఎన్‌జీ, వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా తరువాత దేశంలో వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది. ఈ తరుణంలో ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను మరింతగా తగ్గించాలని యోచిస్తోంది.కేంద్రం పామాయిల్‌‌ దిగుమతులపై టాక్స్ తగ్గించినప్పటికీ ధరలు మాత్రం తగ్గటం లేదు. ఇండోనేషియాలో పామాయిల్ సంక్షోభం కారణంగా, భారత్ లో వంట నూనెల ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం పామాయిల్ ఉత్పత్తి చేసే ఇండోనేషియాలోనే ఆయిల్ కొరత ఏర్పడింది. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి దిగుమతులను తగ్గించడానికి డీజిల్‌లో 30 శాతం పామాయిల్‌ ను కలపడం తప్పనిసరి చేసింది. దీంతో బయోడీజిల్ అవసరాల కోసం పామాయిల్ ని ఆ దేశం వినియోగిస్తోంది. దీని కారణంగా 17.1 మిలియన్ టన్నుల పామాయిల్ ఉత్పత్తిలో.. 7.5 మిలియన్ టన్నులు బయో డీజిల్‌కు, మిగిలిన 9.6 మిలియన్ టన్నులు గృహ, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఒక్క సారిగా ఇండోనేషియాలో ఒక్కసారిగా పామాయిల్ ధరలు చుక్కలను తాకాయి. దీని వల్ల అక్కడి ప్రభుత్వం ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. మార్చి 2021లో ఇండోనేషియాలో ఒక లీటరు బ్రాండెడ్ వంట నూనె ధర 14,000 ఇండోనేషియా రూపాయలు  ఇది మార్చి 2022లో 22,000 ఇండోనేషియా రూపాయలకు పెరిగింది. దేశంలో ఒక సంవత్సరంలో 57 శాతం వంట నూనె పెరిగింది. ఫిబ్రవరి 1న, ఇండోనేషియా ప్రభుత్వం రిటైల్ ధరలకు గరిష్ట పరిమితిని విధించింది.ఈ కారణాల వల్ల ఇండేనేషియా ప్రభుత్వం ఎగుమతులపైనా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. పామాయిల్ ఎగుమతులను నిషేధించాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం భారత్ పై భారీగా ఉండనుంది. ఎందుకంటే.. దేశ వంటనూనె అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆదారపడ్డాయి. అందులోనూ.. ఇండోనేషియా నుంచి భారత్ ఎక్కువగా పామాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. పామాయిల్ కొరత త్వరలోనే భారత్ పై పడనుందని నిపుణులు, మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని వల్ల సామాన్యులపై ధరల భారం పడనుందని తెలుస్తోంది.

Related Posts