YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

మావోయిస్టుల మెరుపు దాడి.. నలుగురు జవాన్ల కు గాయాలు

మావోయిస్టుల మెరుపు దాడి.. నలుగురు జవాన్ల కు గాయాలు

బీజాపూర్ ఏప్రిల్ 18
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్బా సమీపంలోని జైగుర్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశాని బస్తర్‌ ఐజీ పీ సుందర్‌రాజ్‌ చెప్పారు. ఈ దాడిలో భద్రతా సిబ్బంది నలుగురు గాయపడ్డారని తెలిపారు.వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని హెలీకాప్టర్‌లో రాయ్‌పూర్‌ దవాఖానకు తరలించామన్నారు. మరో ఇద్దరికి బీజాపూర్ జిల్లా దవాఖానలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించామని, మావోయిస్టులకోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు.

Related Posts