YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మానికి జగ్గారెడ్డి

ఖమ్మానికి  జగ్గారెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్  20
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్‌ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం.. కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.. ఖమ్మలో ఏం చేస్తాం అనేది చూపిస్తామన్న ఆయన.. మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు.. ఇక, తమ పర్యటనలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని కూడా పరామర్శిస్తామని వెల్లడించారు జగ్గారెడ్డి.. పార్టీ కార్యకర్త లాగా కాదు.. సాధారణ పౌరుడిగా పరామర్శ చేస్తామన్నారు.
12 సీట్లు గెలిచి గిఫ్ట్ ఇస్తాం
ఆర్ఎస్‌, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్‌ఎస్‌-బీజేపీ ప్లాన్‌ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్‌ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణకి పూర్తి సమయం ఇస్తామని రాహుల్‌ గాంధదీ తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదన్నారు జగ్గారెడ్డి.రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు జగ్గారెడ్డి.. వరికి గిట్టుబాటు ధర లేదు.. వరి వేయొద్దు అని కేసీఆరే అనడం 40 శాతం వరి వేయలేదని.. ఈ విషయంలోనూ బీజేపీ-టీఆర్ఎస్‌ దాగుడు మూతల ఆట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, బండి సంజయ్ పనికి మాలిన మాటలు మాట్లాడతారు.. కేసీఆర్‌ తియ్యటి మాటలు చెబుతారు.. ఇద్దరితో రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి.. వరి వేయని రైతుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. ఆ రైతుల పొట్ట కొట్టింది టీఆర్ఎస్‌-బీజేపీయే అని ఆరోపించారు.. బండి సంజయ్ కి తు.. తెలియదు..తా తెలియదని సెటైర్లు వేసిన జగ్గారెడ్డి.. టీవీలను పిలిచి భౌభౌ అని అరుస్తారని.. రాజకీయం చేసేది అంతా సెంట్రల్ బీజేపీయే అన్నారు.. బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినా పరవాలేదు.. కానీ, కాంగ్రెస్ రావద్దని కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరోవైపు, వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు రైతులు, నిరుద్యోగులు అంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ బలోపేతం అవుతుందని.. ఐదు లక్షల మందితో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామన్నారు.. ఇక, తెలంగాణ నుండి 12 ఎంపీ సీట్లను గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.

Related Posts