YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

పోర్ట్‌ బ్లేయిర్‌ మే 9
అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్‌బెల్‌ బే వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. క్యాంప్‌బెల్‌ తీరానికి 85 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నదని తెలిపింది. కాగా, అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అండమాన్‌ దీవుల్లో పది రోజుల వ్యవధిలో భూకంపం రావడం ఇది రెండో సారి.ఏప్రిల్‌ 30న డిగ్లిపూర్‌లో 11.04 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది. కాగా, గత నెల 10న కూడా భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యాన 70 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది.

Related Posts