YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీహార్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం8 మంది కూలీలు మృతి

బీహార్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం8 మంది కూలీలు మృతి

పాట్నా మే 23,
బీహార్‌లోని పుర్నియా జిల్లాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుత‌ప్పి జాతీయ ర‌హ‌దారి 57పై బోల్తా ప‌డింది. దీంతో ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో జరిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.బాధితులంద‌రూ రాజ‌స్థాన్‌కు చెందిన వార‌ని పోలీసులు పేర్కొన్నారు. సిలిగురి నుంచి జ‌మ్మూకు లారీ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే క్ష‌త‌గాత్రుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. లారీ డ్రైవ‌ర్, క్లీన‌ర్ ప్ర‌మాద‌స్థ‌లి నుంచి త‌ప్పించుకున్నారు. డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తులోకి జారుకోవ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవ‌ర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Related Posts