YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ యాత్రకు అనుమతి.. కండిషన్స్ అప్లై

లోకేష్ యాత్రకు అనుమతి.. కండిషన్స్ అప్లై

విజయవాడ, జనవరి 24, 
27వ తేదీ నుంచి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ జరిగే పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లుగా చిత్తూరు ఎస్పీ ప్రకటించారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని షరతు విధించారు. దీంతో పాదయాత్రకు అనుమతి లభిస్తుందా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది. 27 వ తేదీన కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం  అవుతుంది.ఈ నెల‌ 27నుంచి రాష్ట్రంలో టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  పాదయాత్ర ప్రారంభం కానుంది...40 రోజుల క్రితమే లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి..రాష్ట్రలో ఉన్న వివిధ వర్గాల ప్రజల‌ సమస్యలను ఫోకస్ చేస్తూ పాదయాత్ర  సాగనుందని తెలిపారు..పాదయాత్రకు యువగళం అన్న పేరును ఖరారు చేశారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది.  జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.  పాదయాత్ర  కు అనుమతి కావాలంటూ పోలిట్ బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న  ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి  లేఖ రాశారు.   స్పందించక పోవడంతో రెండు సార్లు రిమైండర్ కూడా పంపారు. 21 వ తేదిన డీజీపీ స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపారు  . 400 రోజుల‌పాటు లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు సంబధించి‌ డీజీపీ అడిగిన వివరాలు ... నాలుగు  వందల‌ రోజులకు సంబంధించి  ప్రతి రోజు ఎవరెవరు పాదయాత్రలో‌ పాల్గొంటారు..?  లోకేష్ ను కలుసుకునే వ్యక్తుల వివరాలు వారి ఆథార్ కార్డు తో సహా సమర్పించాలి అని లేఖలో‌ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‌పాదయాత్రలో  ఉండే వాహన కాన్వాయ్ వివరాలు... వాహనాల‌ రిజిస్ట్రేషన్ నెంబర్లు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ తో సహ వివరాలు...రూట్ మ్యాప్ ఏ బజారు నుంచి ప్రారంభమై ఎక్కడ ఆ రోజు ముగుస్తోందో 400 రోజలకు సంబంధించిన  వివరాలు... ఏ సమయంలో ఏ ప్రాంతంలో యాత్ర సాగుతోందో తేదీల‌ వారిగా వివరాలు... ప్రతి రోజు బస చేసే ప్రాంతం ..ఎక్కడ నైట్ స్టే అవుతారో తెలియచేస్తూ స్థానికంగా ఆ బాధ్యతలు చూసే వారి ఫోన్ నెంబర్లు అందచేయాలని లేఖలో  ప్రస్తావించారు.  ఈ వివరాలన్నీ ఇవ్వడం సాధ్యం కాదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా.. పాదయాత్ర జరిగి తీరుతుందని.. తమది ప్రజాస్వామ్య హక్కు అంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి.. అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పడంతో  టీడీపీ శ్రేణులు ఇక అడ్డుకోరన్న ఉద్దేశంతో ఉన్నాయి.  పాదయాత్రను భారీ ఎత్తున విజయవంతం చేసుకోవడానికి లోకేష్ చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు.  కొన్ని వేల మంది ని నేరుగా కలిసి మద్దతు అడిగారు. ఆయనతో పాటు నడిచేందుకు కార్యకర్తలు కూడా సిద్ధమయ్యారు.

Related Posts