YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

48 వేలు దాటిన ఎర్రబంగారం

48 వేలు దాటిన ఎర్రబంగారం

కర్నూలు, మార్చి 16,
మిర్చి ఎర్రబంగారంగా మారింది. బంగారంతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి ఎండు మిర్చి ధరలు. మార్కెట్‌కు సరుకు కాస్త తక్కువగా వస్తూ ఉండటంతో.. డిమాండ్ అమాంతం పెరిగింది. కర్నూలు మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మిర్చికి రికార్డు రేటు దక్కింది. క్వింటా ధర  ఏకంగా రూ.48,299 పలికింది. తెలంగాణలోని గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం కోనేరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు పంట మాంచి రేటుకు అమ్ముడయ్యింది. ఆయన  3.62 క్వింటాళ్ల ఎండుమిర్చిని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెచ్చాడు.బ్యాడిగ రకం అవ్వడం.. సరుకు క్వాలిటీ కూడా సూపర్‌గా ఉండటంతో.. వ్యాపారులు మంచి ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే క్వింటా రూ.48,299కు కొనుగోలు చేశారు. కర్నూలు మార్కెట్‌లో ఇప్పటి వరకు ఇదే హై రేటు అని అధికారులు తెలిపారు.  గతేడాది మిర్చి రైతును నల్ల తామర ఇబ్బంది పెట్టింది. కనీసం పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా తిరిగి రాలేదు. దీంతో అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలపై రైతులు ఫోకస్ పెట్టారు. నల్ల తామర నివారణకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో  చీడపీడల  సమస్య తగ్గింది. మంచి ధర కూడా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధర ఇంకాస్త పెరుగుతుందేమో అని కొందరు రైతులు పంటను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకుంటున్నారు. పంట తక్కువగా ఉండటంతో.. ధర మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Related Posts