YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు

రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు

జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్గయ్యపేట పట్టణంలో జమ్మి చెట్టు సెంటర్ నందుగల అమరజీవి పొట్టి శ్రీరాములు  విగ్రహానికి తెదేపా శ్రేణులతో కలిసి జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు  విగ్రహానికి పూలమానులు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు, ఆంధ్ర రాష్ట్ర అవతారణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు.
ఈ కార్యక్రమంలో నూకల కుమార్ రాజా, గట్టిడి దుర్గాప్రసాద్,మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, గింజుపల్లి రమేష్, కానూరి కిషోర్, కర్రి చిన్న వార్డు కౌన్సిలర్లు పేరం సైదేశ్వరరావు, సంగెపు బుజ్జిబాబు, గొట్టే నాగరాజు, ఇర్రి నరసింహారావు, నూకల బాలకృష్ణ,  నాయకులు బేతు ప్రభాకర్, పున్నా ఉపేంద్ర, గుంజ నరసయ్య, షేక్ ఇంతియాజ్, కొప్పు సుధాకర్, మద్ధుల ఉమా మహేశ్వర రావు, రాయపూడి శ్రీకాంత్, కర్లపాటి కొండ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts