
మహబూబ్ నగర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. గురువారం ఒకసారిగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో మార్కెట్ యార్డ్ లో వేరుశెనగ పూర్తిగా తడిసి పోయింది. గద్వాల జోగులాంబ జిల్లాలో అయితే వర్షపు నీరుకు వేరుశనగ కొట్టుకపోయింది. గద్వాల జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులు తీసుకోవచ్చిన వేరుశనగ అకాల వర్షానికి తడిచి అపార నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా మార్కెట్ యార్డ్ అధికారులు, పాలకులు స్పందించకపోవడం తో వారి నిర్లక్ష్యంతో పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అధికారులు సకాలంలో చర్యల తీసుకున్నట్లు అయితే వేరుశనగ నష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పోయిన పంటకురాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
భారీ వర్షంతో అల్లాడిపోతున్న రైతులు
జగ్గయ్యపేట నియోజకవర్గం లోని రామచంద్రన్నపేట గ్రామంలో గురువారం త్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి రైతులు విలవిలాడిపోయారు. కళ్ళల్లో ఆరబోసిన మిర్చి పూర్తిగా వర్షంతో తడిసి నీటి ముద్దైపోయింది. పంట చేతికి వచ్చిన సమయంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తీవ్ర నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి మంచి ధర పలికిన సమయంలో భారీ వర్షంతో రైతులను వెన్ను విరిచింది. రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు.
మరో రెండు రోజుల పాటు వానలు
పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఛత్తీస్గఢ్ ఒడిశా వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి.తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. మార్చి 18నములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ఆవరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఉత్తర భారతదేశంలోని వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది సమయానికి ముందే ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతల బలమైన ప్రభావం కనిపించింది. తాజాగా పాకిస్తాన్లో ఏర్పడిన తుపాను ప్రసరణ కారణంగా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో మార్పు వచ్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మార్చి నెలలోనే వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.