YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పేపర్ లీకేజ్ రాజకీయం...

పేపర్ లీకేజ్ రాజకీయం...

హైదరాబాద్, మార్చి 17, 
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకటైన ప్రవీణ్ కు చెందిన పెన్ డ్రైవ్ లో మూడు పేపర్లను పోలీసులు గుర్తించారు. ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులను ప్రవీణ్ ను విచారించారు. ప్రవీణ్ పెన్ డ్రైవ్ ఎఫ్ఎన్సీ విభాగానికి పంపించారు పోలీసులు. ఈ పెన్ డ్రైవ్ లో మూడు పేపర్లు కాపీ చేసినట్లు అధికారులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సహా మరో పేపర్ కాపీ చేసినట్లు తెలుస్తోంది.  పేపర్ల లీకేజీ కేసును ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఏఈ ప్రశ్నాపత్రం లీక్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో అధికారులు మరో మూడు పేపర్లు గుర్తించారు. ఏఈ పేపర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లు, టెక్నికల్ ఆఫీసర్ పరీక్షల పేపర్లు లీక్ ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా ఏఈ పేపర్ నకళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లను ఉంచుకున్నాడు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపర్ నకళ్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక అడిగినందువల్లే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, , పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌ రెడ్డి పేపర్లు లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు  మార్చి 5న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది.ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు మార్చి 5న నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్ష కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమైంది. దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)  పరీక్షపై బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మార్చి 14న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ కమిషన్. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు ఇటీవల నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీకరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కీలక మలుపు
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం తాజాగా కీలక మలుపు తీసుకుంది. నిందితుడు ప్రవీణ్ మొత్తం ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్టు తేలింది. సిట్ విచారణలో భాగంగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో భేటీ అయిన సిట్ చీఫ్.. లక్ష్మీ దగ్గర నుంచి పాస్‌వర్డ్‌ను ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్‌కి లబ్ది చేకూర్చేందుకు గాను.. కంప్యూటర్ లాన్‌లో రాజశేఖర్ పలు మార్పులు చేసినట్టు తెలిసింది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీన్ పేపర్స్ బాంచ్ కొట్టేశాడు. తన దగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో ఆ పేపర్స్‌ని ప్రవీణ్ సేవ్ చేసుకున్నాడు.ఈనెల 5వ తేదీన జరిగిన ఏఈ ఎగ్జామ్ పేపర్‌తో పాటు మరికొన్ని పేపర్లను ప్రవీణ్ కొట్టేశాడు. 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్లను సైతం ప్రవీణ్ దొంగలించాడు. భవిష్యత్తులో జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను కూడా ప్రవీన్ తన దగ్గర పెట్టుకున్నాడు. సమయం చూసి, ఈ పేపర్లను విక్రయించాలని ప్రవీణ్ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. భవిష్యత్తులో జరిగే పేపర్లన్నింటినీ ఇస్తానని రేణుకకి ప్రవీణ్ హామీ ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ పరీక్షలు రాయబోయే అభ్యర్తులను వెతికి.. బేరం మాట్లాడి పెట్టాలని రేణుకకు ప్రవీణ్ చెప్పినట్టు సిట్ విచారణలో బహిర్గతమైంది. మరింత సమాచారాన్ని రాబట్టడం కోసం సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.తనకున్న సాన్నిహిత్యంతో రేణుక అనే యువతి అనే సోదరుడి కోసం ప్రశ్నాపత్రం అడగ్గా, ప్రవీణ్‌ సిస్టమ్ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసి, ఆ అమ్మాయికి నేరుగా వాట్సప్ చేశాడు. దాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఆ యువకుడు.. తన స్నేహితుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు తీసుకొని, వారికి ఆ ప్రశ్నాపత్రాన్ని పంపాడు. అయితే.. డబ్బులు ఇచ్చే విషయంలో తేడాలు రావడంతో, ఓ యువకుడు 100కు డయల్ చేసి, పేపర్ లీక్ విషయాన్నిచెప్పాడు. అలా ఈ లీకేజ్ వ్యవహారం బట్టబయలైంది.

సూత్రధారి ప్రవీణ్... పాత్రధారి రేణుకా
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ విచారణ వేగవంతం చేయటంతో... కీలక సమాచారం బయటికి వస్తోంది. ఇప్పటి వరకు ఏఈ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందని గుర్తించగా.... సిట్‌ విచారణలో ప్రవీణ్‌ అక్రమాలు మరిన్ని బయటకు వచ్చినట్లు సమాచారం.ప్రవీణ్ పెన్ డ్రైవ్ ను సీజ్ చేసిన పోలీసులు... ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించి విశ్లేషించారు. అయితే ఇందులో కేవలం ఏఈ పరీక్షా పత్రం కాకుండా... టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక కేవలం ప్రవీణ్ పెన డ్రైవ్ మాత్రమే కాకుండా... ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితుల ఫోన్లను కూడా పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించారు. మరోవైపు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... నిందితులు గత కొంతకాలంగా ప్రధానంగా ఎవరితో మాట్లాడారన్న విషయాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేస్తారని సమాచారం.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల కొనుగోలు కోసం తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేణుక తమ్ముడికి ఏఈ పరీక్షకు హాజరయ్యే అర్హత లేకపోయినా అతని పేరుతో ప్రశ్నాపత్రాల కోసం ప్రయత్నించినట్లు తేల్చారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వద్ద సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ నుంచి ప్రశ్నాపత్రాలు సేకరించి వాటిని విక్రయించేందుకు అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో రేణుక బేరం కుదుర్చుకుంది. టీటీసీ చదివిన రాజేశ్వర్‌ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు కావాల్సిన విద్యార్హత అతనికి లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్‌తో చెప్పింది. అదే సమయంలో ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌ నాయక్‌లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్‌ తన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు.రాజమండ్రిలో ఉన్న తన బాబాయికి ప్రవీణ్‌ రూ.3.5 లక్షలు ఆన్‌లైన్‌లో పంపినట్టు పోలీసులు గుర్తించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్‌ డబ్బు ఆశ చూపించి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో అతనికి కొంత ఇస్తానని చెప్పాడు. ఈలోపే పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో రాజశేఖర్‌కు సొమ్ము అందలేదని పోలీసులు గుర్తించారు.ఇక పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌తల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్‌ 2020లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఎస్సై ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మెయిన్స్‌కు పరీక్షకు సిద్ధమవుతూ ఫిబ్రవరి 1 నుంచి సెలవులో ఉన్నాడు. ప్రశ్నపత్రాలు విక్రయిస్తానంటూ రేణుక ఫోన్‌ చేసినప్పుడు తనకు అవసరం లేదని చెప్పాడు. ఏఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థుల సమాచారం సేకరించి ఆమెకు ఇచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఉంటూ ప్రశ్నాపత్రాల లీకేజీ సమాచారం తెలిసినా ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా తీసుకున్నారు. శ్రీనివాస్ వ్యవహారంపై సీపీ కార్యాలయానికి నివేదిక పంపినట్టు మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నపత్రాలు లీకైనట్లు తెలియగానే టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి వచ్చే సిబ్బంది వివరాలను అధికారులు సేకరించారు. కంప్యూటర్లు, ల్యాన్‌ ఉన్న గదుల్లోకి ప్రవీణ్‌కుమార్‌ వచ్చినట్టు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో ఉండే ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకునేందుకు ప్రవీణ్ ఆసక్తి చూపేవాడని, రహస్య వివరాలపై తమతో చర్చించాడని ఓ ఉద్యోగి పోలీసులకు తెలిపాడు. అతనిపైనే అనుమానాలున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కమిషన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ప్రవీణ్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం బయట పడింది.ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రేణుక 2018లో టీజీటీ హిందీ పోస్టుకు రేణుక ఎంపికైంది. వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామ పరిధిలోని బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే రోజు వరకు రేణుక మొత్తం 16 రోజులు సెలవు పెట్టినట్లు గుర్తించారు. జనవరిలో 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరిలో 1వ తేదీ, 4 నుంచి 8 వరకు, 24న సెలవు పెట్టింది. మార్చి 4, 5 తేదీల్లో ఏఈ పరీక్ష జరిగినపుడు కూడా సెలవు తీసుకుంది. తన బాబుకు బాగా లేదని, సెలవు కావాలంటూ ప్రిన్సిపల్‌కు 4న అర్ధరాత్రి ఒంటి గంటకు వాట్సప్‌ మెసేజ్‌ పెట్టింది. 5న సీవోఈ ప్రవేశపరీక్షకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించేందుకు రావాలని కోరినా రాలేదని తెలిసింది. తమ మరిది చనిపోయారని, మూడు రోజుల సెలవులు కావాలని 10న వాట్సప్‌ ద్వారా కోరింది. దీంతో ప్రిన్సిపల్‌ 10, 11, 12 తేదీలను సెలవుగా మార్కు చేశారు.మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సెలవులో ఉన్నారని సిబ్బంది భావించారు. అదేరోజు సాయంత్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టుల రాతపరీక్ష ఈ నెల 12న జరగాల్సి ఉంది. మార్చి 10, 11, 12, 13 తేదీల్లో కూడా ఆమె సెలవులు పెట్టడాన్ని గుర్తించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రేణుకను సస్పెండ్‌ చేయనున్నట్లు గురుకుల సొసైటీ వర్గాలు వెల్లడించాయి.

Related Posts