YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయవాడకు మెట్రో భాగ్యం లేదా

విజయవాడకు మెట్రో భాగ్యం లేదా

విజయవాడ, జూన్ 1, 
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు కదలడం లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామం పరిధిలో 3 వేల 272.55 చదరపు గజాల భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వ చర్యలు చూస్తూ ఉంటే విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు ముందుకు కదలడం కష్టమేనని అంటున్నారు. గత ప్రభుత్వం 2017లో మెట్రో రైల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో భాగంగా ఎనికేపాడు పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలోని 3 వేల 272.55 చదరపు గజాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. వాటిలో కొంత గ్రామకంఠం భూమితో పాటు, వివిధ వ్యక్తులకు చెందిన ఇళ్ల స్థలాలున్నాయి. ఆ భూ సేకరణ ప్రతిపాదన రద్దు చేస్తూ కలెక్టర్ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్ గడువు 2019లోనే ముగిసిందని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైల్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే అప్పుడు మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడ మెట్రో రైల్ మార్గం కోసం గత ప్రభుత్వం భూసేకరణకు ప్రతిపాదించింది. ఆ భూమిని భూసేకరణ నుంచి తప్పిస్తే వాటి యజమానులు అక్కడ భవనాలు నిర్మించుకోవచ్చు. విజయవాడలో అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉంటుందని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని.. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మెట్రోను పట్టించుకోకపోవడంతో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రతి పక్షాలు కూడా ఎదురుదాడి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంత వరకు మెట్రో రైళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలే ఉన్నాయని అంటున్నారు.

Related Posts