YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

త్రిపుల్ తలాఖ్ తరువాత బీజేపీకి ముస్లీం మహిళల మద్దతు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

త్రిపుల్ తలాఖ్  తరువాత బీజేపీకి ముస్లీం మహిళల మద్దతు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్
చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద బిజెపి విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డ్డి, బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తాం. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుంది. నరేంద్రమోదీ  నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో  తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని అన్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో  భారతీయ జనతా పార్టీ గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం. అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో మమేకమవుతూ, రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర కొనసాగుతుంది. మార్చి 2వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాం. పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర జరుగుతుంది. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులందరూ యాత్రలో పాల్గొంటారు.  రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్రమోదీ  మరొకసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకోసమే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాం. హైదరాబాద్ పార్లమెంటు కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు నరేంద్రమోదీ  నాయకత్వం కోరుకుంటున్నారు. 17కు 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటాం. నరేంద్రమోదీ  నాయకత్వంలో సమిష్టిగా పని చేస్తాం.  మా జెండా కమలం పువ్వు జెండా...మా నాయకుడు నరేంద్ర మోదీ  కమలం పువ్వు జెండా పట్టుకుని నరేంద్రమోదీ  నాయకత్వంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. భారతీయ జనతా పార్టీని ఆదరించండి...నరేంద్ర మోదీ  నాయకత్వానికి ఆశీస్సులు అందజేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాననిఅన్నారు. .

Related Posts