YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వాటర్ వేస్ట్ చేస్తే 5 వేలు ఫైన్

వాటర్ వేస్ట్ చేస్తే 5 వేలు ఫైన్

బెంగళూరు, మార్చి 7,
వేసవి ఇప్పుడే మొదలైంది.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా వేసవి మొదలుకాక ముందే బెంగళూరులో తాగునీరు కరువైంది. దీంతో జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో బెంగళూరు వాసులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బెంగుళూరులో నాలుగురోజులుగా నీటి సరఫరా లేక వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ పామ్ మెడోస్ సొసైటీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మున్ముందు 40 శాతానికి పెంచుతామని హెచ్చరించింది. నీరు వృథా చేస్తే 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నీటివాడకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను సైతం నియమించింది. వీరంతా నీటి వినియోగంపై దృష్టిపెట్టనున్నారు.కాగా, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. గతంలో ట్యాంకర్ నీరు రూ. 650 నుండి రూ 800కు ఇస్తున్న ట్యాంకర్ యజమానులు రెండు వారాల క్రితం రూ. 1,300 నుండి రూ 1,500 పెంచేశారు. అయితే ఇప్పుడు ఏకంగా రూ 2,000 అని చెప్పడంతో ప్రజలు షాక్ అవుతున్నారు. అంత డబ్బులు పెట్టి నీరు కొనుగోలు చెయ్యలేక సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది చివరిలో కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడం వలనే బెంగళూరులో తాగునీటి కష్టాలు ఎదురౌతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇదిలాఉంటే.. బెంగళూరులో తాగునీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.. బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందంటూ పేర్కొన్నారు.

Related Posts