YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్దం

దేశ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్దం

హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమయింది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. రెండు నెలలపాటు పలు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోక్ సభ, ఆంధ్ర ప్రదేశ్ లో ఒకేసారి ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వుంటుంది. లోక్ సభ ఎన్నికల పై తెలంగాణలో త్రిముఖ పోటీ తప్పదు. ఏపీ లో సిద్ధం అంటూ జనాల్లోకి వెళ్తున్న జగన్.. వై నాట్ 175 అంటున్నారు. ఇక టీడీపీ జనసేన - బీజేపి పొత్తుతో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా 400 లోక్ సభ సీట్లే బీజేపి టార్గెట్.. కాషాయ దళం పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది. పలు పార్టీల మద్దతు కూడగట్టుకుని రాహుల్ గాంధీ జోడో యాత్రతో జోష్ లో కాంగ్రెస్ నిమగ్నమయింది. ఇప్పటికే పార్టీల గెలుపుపై సర్వేలు ట్రెండ్ అవుతున్నాయి.

Related Posts