YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

31వ తేదీ బ్యాంకులు పనిచేస్తాయి...

31వ తేదీ బ్యాంకులు పనిచేస్తాయి...

ముంబై, మార్చి 23
ప్ర‌తి ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు హాలీడే అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఈ నెల 31వ తేదీన‌(ఆదివారం) బ్యాంకులు తెరిచే ఉంటాయ‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్ల‌డించింది. దానికి కారణం ఏంటంటే.. మార్చి 31న ఈ ఏడాది ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో ఆఖరు రోజు. అందుకే అన్ని బ్యాంకు శాఖ‌ల‌ను ఈ నెల 31 ఆదివారం నాడు తెరిచే ఉంచాల‌ని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాల మేర‌కు మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఇది కాకుండా అన్ని ఏజెన్సీ బ్యాంకులు కూడా ఖాతాదారుల‌కు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాయి. తద్వారా రసీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలు FY24లో నిర్వహించబడతాయని సమాచారం. ఈ నోటిఫికేషన్‌ను ఆర్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ టీఎస్‌ నాయర్‌ విడుదల చేశారు.ఈ ముఖ్యమైన తేదీలో పనిచేయడానికి ఆర్బీఐ 33 ఏజెన్సీ బ్యాంకులను నియమించింది. ఈ జాబితాలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా  వంటి ప్రముఖ పేర్లతో పాటు 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి, వాటిలో హెడిఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసిఐసిఐ  బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. అదనంగా, DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఈ ఏర్పాటులో ఏకైక విదేశీ బ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ బ్యాంకులు మార్చి 31న పూర్తి సేవలను అందించనున్నాయి. అంతేకాదు.. మార్చి నెలాఖరున గుడ్ ఫ్రైడేతో పాటు శని, ఆదివారాల సెలవులను ఐటీ శాఖ రద్దు చేసింది. ఆయా రోజులలో బ్యాంకులతో పాటు, ఆదాయపు పన్ను శాఖ అన్ని కార్యాలయాలు కూడా మార్చి 31న తెరిచి ఉంటాయి. ఐటీ శాఖ మార్చి 29, 30 , 31 మూడు రోజులూ పని చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆ శాఖ ఈ కీలక నిర్ణయం ప్రకటించింది.

Related Posts