YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టిక్కెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య

టిక్కెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య

చెన్నై, మార్చి 28
కొద్దిరోజుల క్రితం తన నివాసంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈరోజు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులోని ఈరోడ్‌ నుంచి ప్రస్తుత లోక్‌సభ ఎంపీ, ఎండిఎంకే కి చెందిన ఎ. గణేష్‌మూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గురువారం ఉదయం 5:05 గంటలకు గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారుఎండిఎంకెకు చెందిన గణేష్ మూర్తి ఈరోడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఈసారి ఈరోడ్ నియోజకవర్గాన్ని డీఎంకే కైవసం చేసుకుంది. దీంతో గణేశమూర్తికి అవకాశం ఇవ్వలేదు. దీంతో డిప్రెషన్‌లో ఉన్నాడని అంటున్నారు. మార్చి 24 న లోక్‌సభ ఎన్నికలకు టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ మూర్తి తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు కుటుంబసభ్యులు. కాగా, అతను చికిత్స పొందుతుండగా ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

Related Posts