YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏప్రిల్, మే, జూన్ లలో విపరీతమైన వేడి గాలులు: ఐఎండీ హెచ్చరిక..

ఏప్రిల్, మే, జూన్ లలో విపరీతమైన వేడి గాలులు: ఐఎండీ హెచ్చరిక..

న్యూఢిల్లీ
దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు మండి పోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం  నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.. మధ్య, పశ్చిమ ద్వీప కల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది.  ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశం లోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీప కల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశముందన్నారు.  సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని, ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశముందని హెచ్చరించారు.  గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్ లలో వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మహాపాత్ర చెప్పారు..

Related Posts