
న్యూఢిల్లీ, జూన్ 17,
ప్రపంచంలో అగ్రదేశాలతో సమానంగా తమ వద్ద కూడా అన్వాయుధాలు ఉండాలని ఇస్లామిక్ దేశాలు కలలు కన్నాయి. అయితే ఇందులో కేవలం మూడు దేశాలు మాత్రమే ఒక అడుగు ముందుకు వేశాయి. కానీ వాటి కలలను అమెరికా, భారత్, ఇజ్రాయెల్ కల్లలు చేశాయి.ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ దశాబ్దాలుగా అణు శక్తి ఆయుధాల రంగంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మూడు దేశాల అణు కార్యక్రమాలు వివాదాస్పదంగా, అంతర్జాతీయ ఒత్తిళ్లకు కేంద్రంగా ఉన్నాయి. అయితే, అమెరికా ఇరాక్ అణు కార్యక్రమాలను ఆదిలోనే తుంచేసింది. సద్దాం హుస్సేన్ను చంపడంతోపాటు అక్కడి ప్రభుత్వం మార్చడం, అమెరికా సైనిక చర్యలతో ఇరాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. దీంతో అణ్వయుధం తయారు చేయాలన్న ఇరాక్ కల చెదిరిపోయింది. ఇక ఇటీవలి పరిణామాలు ఇరాక్, పాకిస్తాన్ దేశాల అణు ఆశలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.ఇరాన్ అణు కార్యక్రమం, 2015లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అయితే, 2018లో యునైటెడ్ స్టేట్స్ ఈ ఒప్పందం నుంచి వైదొలగడం, కఠిన ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్ అణు కార్యక్రమం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒడంబడికలలో విశ్వాసం కోల్పోవడం వల్ల ఇరాన్ అణు ఆకాంక్షలు దెబ్బతిన్నాయి. ఇటీవలి చర్చలు JCPOA ని పునరుద్ధరించడంలో విఫలమవడం, ఇజ్రాయెల్ నుంచి సైనిక ఒత్తిడి ఇరాన్ను మరింత ఇరుకున పెట్టాయిపాకిస్తాన్ 1998లో అణు పరీక్షలు నిర్వహించి, అణు శక్తి దేశంగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఆంక్షల భయం పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీస్తున్నాయి. అణు ఆయుధాల నిర్వహణ, ఆధునీకరణకు అవసరమైన ఆర్థిక వనరులు కొరవడటం, చైనాపై ఆధారపడటం పాకిస్తాన్ను ఒక గండిలో పడేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి నిరంతర పరిశీలన, భారత్తో ఉద్రిక్తతలు ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.ఇరాన్, పాకిస్తాన్లు అంతర్జాతీయ సమాజం నుంచి విభిన్న ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఆంక్షలు, సైనిక బెదిరింపులు ఉండగా, పాకిస్తాన్పై ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద ఆరోపణలు ఒత్తిడి తెస్తున్నాయి. అణు ప్రసార నిరోధక ఒప్పందం వంటి అంతర్జాతీయ చట్రంలో ఈ దేశాలు సమర్థవంతంగా సహకరించలేకపోవడం వాటి అణు కార్యక్రమాలకు అడ్డంకిగా నిలుస్తోంది.ఇరాన్, పాకిస్తాన్ అణు కార్యక్రమాలు విఫలమవడం దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలలో శక్తి సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ విషయంలో, అణు కార్యక్రమం ఆగిపోవడం ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనం కల్పిస్తుంది. పాకిస్తాన్ విషయంలో, అణు ఆయుధాల ఆధునీకరణలో వెనుకబడటం భారత్తో రక్షణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ రెండు దేశాలూ తమ అణు ఆకాంక్షలను కొనసాగించాలంటే, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ సహకారం కీలకం.
పాకిస్థాన్ను దెబ్బకొట్టిన భారత్..
పహల్గాం ఉగ్రదాడకి ప్రతీకారంగా భారత్ చేపిట్టిన ఆపరేషన్ సిందూర్తో 9 ఉగ్రస్థావరాలతోపాటు 11 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. కిరాణా హిల్స్లోని పాకిస్థాన్ అణు మానిటరింగ్ సిస్టం దెబ్బతిన్నది. నూర్ఖాన్ ఎయిర్ బేస్పై దాడితో అమెరికాకు నష్టం కలిగింది.ఇక ఇజ్రాయెల్ దాడితో ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు కూడా దెబ్బతిన్నాయి. కనీసం మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. అంటే అణ్వాయుధాలు పునరుద్ధరించుకోవాలంటే మరో 30 ఏళ్లు పడుతుంది. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ టెహ్రాన్తోపాటు అణుస్థావరాలను ధ్వంసం చేసింది. ఆర్థికంగానూ ఇరాన్ను దెబ్బతీసింది.ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ల అణు కార్యక్రమాలు రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ దేశాలు తమ అణు ఆకాంక్షలను సాకారం చేసుకోవాలంటే, దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరచడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశాల అణు కలలు అంతర్జాతీయ ఒత్తిళ్ల నీడలో కమిలిపోతున్నాయి.