YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ,
3000 రూపాయలు చెల్లిస్తే దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా 200 ట్రిప్పులు
ఆగష్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త నిబంధన అమలు.
కమర్షియల్ వాహనాలకు వర్తించని కొత్త నిబంధన
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ కోసం రూ.3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేల పై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు.

Related Posts