
విజయనగరం
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికాపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంటర్ సెకండియర్ స్టోర్ రూమ్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఎస్వో విజయకుమారి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో కొత్తవలస, ఎస్.కోట ఫైర్ సిబ్బంది మంటలపే ఆర్పి వేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని కొత్తవలస స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యస్వకుమార్ తెలిపారు. ప్రమాదంలో సుమారు 250 పరుపులు కాలిపోయినట్లు చెప్పారు.