
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథను అందించి నిర్మించిన సినిమా 'శారీ' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది. ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించిన ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్పై రవిశంకర్ వర్మ నిర్మించారు.
'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆహాలో మరింతగా ప్రేక్షకులకు రీచ్ కానుందీ మూవీ. యదార్థ ఘటనల స్ఫూర్తితో 'శారీ' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సాహిల్ సంభవ్, అప్పాజీ అంబరీష్, కల్పలత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.