YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బెనలతో నిరసన

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బెనలతో నిరసన

మంచిర్యాల
పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనుచిత వాక్యాలు చేశాడు అని చెప్పి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడాన్ని బీసీ సమాజం పై దాడిగా భావిస్తున్నాం ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు మల్లన్న పై దాడికి ఉసిగొలిపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బేషర్టుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మా  పప్పులు ఉడకవని అన్న ఉద్దేశంతో దాడికి పాల్పడిందని భావిస్తున్నాం ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే కలవకుంట్ల కవిత బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. తీన్మార్ మల్లన్నకు బీసీ సమాజం అండగా నిరుస్తుందని ఈ సందర్భంగా  తెలియజేస్తున్నాం. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర బీసీ నాయకుడు గజెల్లి వెంకటయ్య , తుల మధుసూదన్ రావు, శాఖ పురం భీమ్సేన్, చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం, వేముల అశోక్, శాఖ పురం కోటేశ్వరరావు, కీర్తి బిక్షపతి, అంకం సతీష్, నగునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts