YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముస్లింలు రిజర్వేషన్లు కోరడం సమంజసమే:శివసేన

ముస్లింలు రిజర్వేషన్లు కోరడం సమంజసమే:శివసేన
కరుడుగట్టిన హిందూ పార్టీగా ముద్ర పడిన శివసేన సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనార్టీలకు విద్యలో 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశానికి మద్దతు పలికింది. ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. మరాఠా రిజర్వేషన్లతో పాటు ధన్ గర్స్, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు. తమ వర్గానికి కూడా రిజర్వేషన్లు కావాలని ముస్లింలు డిమాండ్ చేయడం సమంజసమైనదేనని చెప్పారు. మరోవైపు, శివసేన నిర్ణయాన్ని ఎంఐఎం స్వాగతించింది. 

Related Posts