YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చెన్నైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు కరుణానిధిని పరామర్శించనున్న బాబు

చెన్నైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు      కరుణానిధిని పరామర్శించనున్న బాబు
డీఎంకే అధినేత కరుణానిధిని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. శనివారం  చెన్నైకు చంద్రబాబు వెళ్లనున్నారు. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని ఆయన పరామర్శించనున్నారు. చెన్నై పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో ఎస్వీయూ విద్యార్థులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమం ‘జ్ఞానభేరి’లో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం.కాగా, కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఈరోజు పర్యటించారు. విస్సన్నపేట మండలం తాతకుంట్లలో నిర్వహించిన ‘గ్రామదర్శిని’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రచ్చబండ’లో గ్రామస్తులు, మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలని చెప్పారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.

Related Posts